నర్సాపూర్ బీజేపీ మండల కార్యవర్గ సమావేశం
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని పద్మశాలి సంఘంలో బీజేపీ నూతన మండల కార్యవర్గం ఏర్పాటు కొరకు సమావేశంలో అభిప్రాయాలు సేకరించి మండల ఇన్చార్జీ తక్కల రమణ రెడ్డికి గురువారం అందచేశారు. రమణ రెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో అందరూ కలిసి పార్టి విజయం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బర్కుంట నరేందర్, జిల్లా కార్యదర్శి రాజేందర్, కౌన్సిల్ మెంబెర్ వినోద్ రెడ్డి, మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.