ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శనివారం నర్సాపూర్ మండలం గొల్లమాడ, నందన్, చెక్ పెళ్లి, బూర్గుపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు.