నిర్మల్: ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ సంబరాలు
భారత సైనికులకు సంఘీభావంగా నిర్మల్ లో టీజీఈ జేఏసీ, జిల్లా పెన్షన్ల సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాలు చేత బూని సంబరాలు జరుపుకున్నారు. ఉగ్ర చర్యలను అంతమొందించేందుకు భారత సైన్యం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని పేర్కొన్నారు. ఇందులో జేఏసీ చైర్మన్ వి. ప్రభాకర్, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న, పూదరి. జనార్ధన్, విలాస్, అశోక్, జోసఫ్ బాబురావు, నరేందర్ బాబు, విజయ్ కుమార్, జవాద్, రవికుమార్ లు ఉన్నారు.