మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై ప్రతివారం నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో శానిటేషన్ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని, మొక్కల సంరక్షణకు గ్రామస్థాయిలో బాధ్యతలు అప్పగించాలన్నారు. పరిశుభ్రత, మంచి నీటి వినియోగం, పచ్చదనం పెంపుతో ప్రజలు ఆరోగ్యంగా ఉండగలరని పేర్కొన్నారు.