శ్రీ గండి రామన్న దత్త సాయిబాబా ఆలయ చైర్మన్ గంగోని భూరాజ్ శనివారం డీసీసీ అధ్యక్షులు శ్రీ కూచాడి శ్రీహరి రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీహరి రావుని శాలువాతో సన్మానించారు. ఆలయ చైర్మన్ మాట్లాడుతూ శ్రీహరి రావు గారి సహకారంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్త సాయిబాబా ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు.