నిర్మల్: సంఘ సంస్కర్తలను స్మరించుకోవాలి

62చూసినవారు
నిర్మల్: సంఘ సంస్కర్తలను స్మరించుకోవాలి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మల్ లో సంఘ సంస్కర్తల మాసంను గురువారం ఘనంగా నిర్వహించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుధాకర్ పేర్కొన్నారు. సావిత్రీబాయి పూలే, జ్యోతిబా పూలే, అంబేడ్కర్, కందుకూరి వీరేశలింగం పంతులు, మొదలైన వారు సంఘం కోసం పాటుపడ్డారని చరిత్ర అధ్యాపకులు శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. యు గంగాధర్, సూర్య సాగర్, డాక్టర్ హేమలత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్