నిర్మల్: భారత సైనికుడు మురళీ నాయక్ కు శ్రద్ధాంజలి

80చూసినవారు
పాకిస్తాన్ భారత్ సంగ్రామంలో అసువులు బాసిన సైనికుడు మురళీ నాయక్ కు నిర్మల్ లో శనివారం రాత్రి నారాయణరెడ్డి మార్కెట్ వ్యాపారుల ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నినాదాలు చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు పాకిస్తాన్ భారత్ తో యుద్ధ పోరును చేసి అతి స్వల్ప కాలంలోనే భయపడి యుద్ధాన్ని విరమించుకుందని పేర్కొన్నారు. భారతీయులంతా ముక్తకంఠంతో సైనికులకు సహాయంగా నిలబడాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్