నిర్మల్ అర్బన్ :భూభారతి పోర్టల్ పై పట్టణంలో అవగాహన సదస్సులు

65చూసినవారు
నిర్మల్ అర్బన్ :భూభారతి పోర్టల్ పై పట్టణంలో అవగాహన సదస్సులు
నిర్మల్ పట్టణంలోని పలు ప్రాంతాలలో భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు అర్బన్ తహసిల్దార్ ఎం. రాజు తెలిపారు. 17న రైతు వేదిక అగ్రికల్చర్ మార్కెట్, 19న అంబేద్కర్ భవనం ఇబ్రహీంబాగ్, 22న బాబ్జి భవన్ గాజులపేట, 30న సిద్ధాపూర్ కమ్యూనిటీ హాల్ ఈ అవగాహన సదస్సులు ఉంటాయన్నారు. పోర్టల్ పై పరిపూర్ణమైన అవగాహనను కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఇందులో రైతులు, ప్రజా ప్రతినిధులు హాజరవాలన్నారు.

సంబంధిత పోస్ట్