ఈనెల 20న జరిగే గ్రామీణ భారత్ బంద్ కరపత్రాల విడుదల
గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ మౌలానా అబుల్ కలాం ఆజా చౌరస్తాలో ఎస్ కే ఎం ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మే 250న ఎస్. కె. ఎం ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని కోరారు. మోడీ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేదంటే ఆందోళనలు కొనసాగుతాయని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఠాగూర్ తిరుపతి తదితరులు ఉన్నారు.