భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయ ఆవరణలో పోలీస్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఇప్పటివరకు లక్షకు పైగా మొక్కలను పోలీసు సిబ్బంది నాటారని తెలిపారు. ఇందులో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, డీఎస్పీ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.