కారు బైక్ ను ఢీకొనగా ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం సోన్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం జాబ్రాపూర్ గ్రామానికి చెందిన గంగన్న (52) తన ద్విచక్ర వాహనంపై నిర్మల్ నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. ఎక్స్ రోడ్డు వద్ద ఓ కారు ఢీకొట్టడంతో గంగన్నకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.