ఆపరేషన్ సిందూర్ కోసం అడెల్లీ ఆలయంలో ప్రత్యేక పూజలు
ధర్మ యుద్ధంలో భాగంగా జరుగుతున్న ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కోరుతూ మహా అడవి పోచమ్మ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ భోజ గౌడ్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్న సైనికులకు ప్రతి ఒక్క భారతీయుడు మద్దతుగా ఉండాలన్నారు. ఆపరేషన్ సింధు విజయం ద్వారా దేశానికి శాంతి స్థిరత్వం చేకూరాలని కోరారు.