నిర్మల్ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత
కోరిన సమాచారాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడంపై నిర్మల్ మున్సిపల్ కమిషనర్ కు సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ హైదర్ వినతి పత్రాన్ని అందజేశారు. కోరిన సమాచారాన్ని ఇవ్వకుండా నిర్మల్ పురపాలక సంఘంలో దరఖాస్తుదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. సహ చట్టం దరఖాస్తులను వెంటనే పున పరిశీలించి నిర్ణీత సమాచారాన్ని దరఖాస్తుదారులకు అందజేయాలని కోరారు. ఇందులో అబ్దుల్ సాదిక్ లు ఉన్నారు.