అందని ద్రాక్ష అయిన మిషన్ భగీరథ పైప్లైన్ నిర్మాణ పనులు
గత ప్రభుత్వ హయాంలో శుద్ధమైన జలం అందరికీ అందేలా చేపట్టిన మిషన్ భగీరథ పనులు నిర్మల్ లో అర్ధాంతరంగా ఆగాయి. పట్టణంలోని విజయనగర్ కాలనీ, అస్రా కాలనీలను అనుసంధానం చేస్తూ వేసిన పైప్ లైన్ నిరుపయోగమైంది. సుమారు 400 కుటుంబాలకు శుద్ధమైన జలాలు అందడం లేదు. వేసిన పైప్ లైన్ ఓ ప్రాంతంలో భాగమంతా భారీ బండారాలతో ఉండడంతో ఏమి చేయలేక వదిలేశారు. దీంతో శివారు ప్రాంతమైన ఈ వీధులలో శుద్ధ జలం అందని ద్రాక్షే అయింది.