ఆంద్, తోటి, ప్రధాన్, కొల్లం, నాయకపోడ్ తెగల వారికి అన్యాయం జరిగితే సహించేది లేదని ఆదివాసి నాయక్ కోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు శంకర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఆరు తెగల ఐక్యవేదిక సమావేశం బుధవారం నిర్వహించారు. ప్రధానపార్టీలు ఆరు తెగల నుంచి ఒక అభ్యర్థికి ఎంపీ టికెట్ ఇవ్వాలన్నారు. లేదంటే అభ్యర్థిని ప్రకటించి గెలిపించుకుంటామన్నారు. విద్య ఉద్యోగం రాజకీయాల్లో మా వాటా మాకు కావాలని డిమాండ్ చేశారు.