హీరో నితిన్ సినిమా చేసేందుకు రూ.75 లక్షలు అడ్వాన్స్ తీసుకొని మోసం చేశారని దర్శకుడు వశిష్ట తండ్రి సత్యనారాయణ ఆరోపించారు. ‘నా కుమారుడు వశిష్ట దర్శకునిగా నితిన్తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాం. ఓ నిర్మాతతో నితిన్కు అడ్వాన్స్ రూ.75 లక్షలు ఇప్పించాం. వశిష్టతో సినిమా చేస్తే రేంజ్ పడిపోతుంది’ అని వద్దు అన్నారని చెప్పారు. ఆ తర్వాత వశిష్ట ‘బింబిసార’తో హిట్ కొట్టారు. ప్రస్తుతం చిరుతో విశ్వభర చేస్తున్నారు.