ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ –2025లో పవార్ కృపా నక్షత్ర అఖిల భారత స్థాయిలో 3050వ ర్యాంక్ సాధించి మేధా ప్రతిభను చాటింది. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు అంబిక, ప్రవీణ్ పవార్లు మాట్లాడుతూ ఆమె ప్రాథమిక విద్యను ఆర్మూర్ పట్టణంలోని విద్య హై స్కూల్లో, ఇంటర్మీడియట్ను హైదరాబాద్లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో పూర్తి చేసిందని తెలిపారు. కృపా విజయంపై పలువురు అభినందనలు తెలిపారు.