ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 35వ వార్డులో చిన్నారి మురికి కాలువలో పడి మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మట్ట ధనశ్రీ (3) తండ్రి ప్రశాంత్ రాంనగర్ లోని ఇంటి ముందు ఆడుకుంటూ ఏడు ఫీట్ల లోతైన మురికి కాలువలో పడి చిన్నారి మృతిచెందింది. చిన్నారి కాల్వలో పడిన విషయం గుర్తు తెలియక కాలనీలో చిన్నారి కోసం వెతికారు. చివరగా మురికి కాలువలో చూడగా చిన్నారి తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు.