ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్ బైపాస్ వద్ద ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి నియోజకవర్గ ఇన్ చార్జ్ వినయ్ రెడ్డి, నిజామాబాద్ మాజీ గ్రంథాలయ ఛైర్మెన్ మారా చంద్ర మోహన్ తదితరులు ఘన స్వాగతం పలికారు.అనంతరం అక్కడి నుండి ర్యాలీగా పెర్కిట్, మామిడిపల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.