ప్రజల రక్షణ సురక్షిత లో భాగంగా నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం ఆర్మూర్ పట్టణంలోని స్థానిక రాజారామ్ నగర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 170 ఇండ్లు మరియు సరైన ధ్రువపత్రాలు లభించని 76 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1కార్ తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఇద్దరు రౌడీషీటర్లు, 4గురు సస్పెక్ట్ వ్యక్తులను చెక్ చేశారు. నంబర్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు 15, 2 ఆటోలు పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ సాయికిరణ్, ఏసీపీ వెంకటేశ్వర్లు రెడ్డి, సీఐలు సత్యనారాయణ శ్రీధర్ రెడ్డి, 9 మంది ఎస్సైలు, ఏఎస్ఐలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.