డొంకేశ్వర్: నేల చూపు చూస్తున్న నిఘా నేత్రం.. పట్టించుకోని అధికారులు

77చూసినవారు
డొంకేశ్వర్: నేల చూపు చూస్తున్న నిఘా నేత్రం.. పట్టించుకోని అధికారులు
డొంకేశ్వర్ మండల కేంద్రం అన్నారం గ్రామంలో గతంలో లక్షల రూపాయలు వేచించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు అంతా సవ్యంగా నడిచింది. తర్వాత అధికారుల నిర్లక్ష్యం కారణంగా గాడి తప్పి గ్రామంలో సీసీ కెమెరాలు పనిచేయకుండా నేల చూపు చూస్తున్నాయి. కేబుల్ ఊడిపోయి కెమెరాలు డామేజ్ అయ్యి దర్శనమిస్తున్నాయి. అధికారులు పట్టించుకోని పని చేసే విధంగా మరమ్మతులు చేయించాలని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్