డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో దాదాపు రూ. 30లక్షల వ్యయంతో గంగమ్మ నూతన ఆలయాన్ని నిర్మించారు. మూడురోజులుగా పురోహితులు క్షేమేంద్రశర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, కలశార్చన, హోమాలు, విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహా మంగళ హారతి నిర్వహించారు.