డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామంలో గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లికి శుక్రవారం సాయంత్రం ఘనంగా బోనాలు తీశారు. ప్రత్యేక భక్తిశ్రద్ధలతో బోనం వండి కోరిన మొక్కులు తీర్చే కొంగు బంగారమైన గంగమ్మ తల్లికి గ్రామ పురవీధుల్లో ర్యాలీగా వెళ్లి బోనం సమర్పించారు. వలతో గంగపుత్రుల జాలరి ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భీష్మయూత్ సభ్యులు, గంగాపుత్ర కులసంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.