శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 24 గేట్ల ద్వారా ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు సోమవారం నీటిని. విడుదల చేశారు. గత రెండు రోజులుగా ఎడతెరపిలేని వర్షాల కారణంగా భారీగా వరద నీరు ప్రాజెక్టులోకి చేరడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా 24 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గోదావరి పరివాహక ప్రజలు, రైతులు మరియు పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.