ఆర్మూర్ పోలీసులు స్టేషన్ లో ఆడిషినల్ డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డిలు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సాకలి సాయిలు హత్య కేసులో నిందితులను పట్టుకొన్నట్లు తెలిపారు. ఈ కేసులో కనపర్తి రాజు, సత్యనారాయణ , బడే రవీ అనే నిందితులను పట్టుకొని విచారించగా సాకలి సాయిలుని కత్తెరతో తలపై పొడిచి వెదురు కర్రలతో హతమార్చినట్లు ఒప్పుకున్నారని తెలిపారు.