ఆర్మూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డినీ మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సమస్యను ఎమ్మెల్యేకు వివరించారు సమస్య పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. విద్యార్థి సమస్య పరిష్కారానికి శాశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.