ఆర్మూర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర మందిరంలో జెండా ప్రత్యేక వస్త్రానికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వందల సంవత్సరాల నుండి ఆర్మూరు పట్టణంలో జెండా జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. పూజలు నిర్వహించిన ప్రత్యేక వస్త్రం తిరుపతికి చేరుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ అధ్యక్షుడు ఆకుల రాజు దంపతులు, హజారి మదన్మోహన్ కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.