నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థ క్షేత్రం శ్రీ శ్రీ శ్రీ భవాని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ప్రధాన అర్చకులు బాలకృష్ణమూర్తి పదవి విరమణ మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈవో వేణు, ఈవో రవీందర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల అర్చక ఉద్యోగుల అధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి సురేందర్ హాజరయ్యారు.