ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాలనే ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని స్థానిక ఎస్ఐ జి. అని రెడ్డి తెలిపారు. కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో రాత్రి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. పోలీసులు అందించే సేవలను ప్రజలకు తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారి సమాచారాన్ని తమకు అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.