వేసవి సెలవుల్లో విజ్ఞానంతో పాటు వినోదాన్ని పొందుతూ పాఠ్య పాఠ్యేతర అంశాలను నేర్చుకునే అవకాశం సమ్మర్ క్యాంప్ల ద్వారా లభిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి ఎన్. ఆంధ్రయ్య అన్నారు. కమ్మర్ పల్లి మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం సమ్మర్ క్యాంప్ను ప్రారంభించారు. ఈ క్యాంప్లో యోగ, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్ ల పైన శిక్షణ ఇవ్వనున్నారు.