నియోజకవర్గ పర్యటనలో భాగంగా మార్గమధ్యంలో మెండోర మండల కేంద్రం ఆర్ అండ్ బి రోడ్డు, డ్రైనేజీ పనులను శుక్రవారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పరిశీలించారు. అనంతరం అధికారులకు పనులు త్వరగా పూర్తయ్యాలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి ఏఎంసీ చైర్మన్ పాలెపు నర్సయ్య, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.