నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ, ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్ చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో చెక్కులు పంపిణీ కార్యక్రమం ఉండగా తులం బంగారం ఇవ్వాలంటూ బాధితులు అనడంతో పోలీసులు వీరంగం సృష్టించారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లాఠీచార్జి ఆపాలంటూ రోడ్డుపై బైఠాయించారు. బంగారం అడిగితే తప్ప అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.