ఇబ్రహీంపేట్‌లో ప్రమాదవశాత్తు కారు బోల్తా

83చూసినవారు
బాన్సువాడ మండలంలోని దుర్కి నుండి ఇబ్రహీంపేట్ ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం కారు అతివేగంగా వచ్చి కల్వర్టు పై నుండి పల్టీ కావడంతో ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కారులో ప్రయాణిస్తున్న వారు గాంధారి మండలంలోని పెట్ సంగెం గ్రామానికి చెందిన వారిగా తెలిసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్