రుద్రూర్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష

69చూసినవారు
రుద్రూర్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష
రుద్రూర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మధ్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పోలీసులకు పట్టుబడిన మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి జైలు శిక్షను విధించారు. బొప్పాపుర్ గ్రామానికి చెందిన యాబాజీ సాయిలు అనే వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించగా, మండలానికి చెందిన రాణంపల్లి గ్రామవాసి వీరేశం అనే వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్