వర్ని మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన జి కోటేశ్వరరావు అనే వ్యక్తి పొలంలో పని చేస్తుండగా గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు ఎస్ఐ రమేష్ శుక్రవారం తెలియజేసారు. పోలీసుల వివరాల ప్రకారం మృతుడు అదే గ్రామానికి చెందిన మేక వెంకటేశ్వరరావు దగ్గర కూలీగా పనిచేస్తున్నాడు. అతని కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.