ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ నేత, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవవడంతో నిరసన సెగలు చెలరేగుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు నిరసన తెలుపుతున్నారు. కష్ట సమయంలో పార్టీ వెన్నంటే ఉన్నా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.