బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరంలో భారత సైన్యానికి మద్దతుగా శక్తి పూజలు శుక్రవారం నిర్వహించారు. దేవదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్, హైదరాబాద్, డిప్యూటీ కమిషనర్, వరంగల్ ఆదేశాల మేరకు ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ పూజలు చేపట్టారు. భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక్ సింధూర్, సైన్యానికి మద్దతుగా ఈ పూజలు నిర్వహించారు.