జక్రాన్ పల్లి మండలం సికింద్రాపూర్కు చెందిన సిర్నాపల్లి ప్రేమ్స్ రెండు నెలల క్రితం కూలి పని నిమిత్తం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని ఎస్ఐ మాలిక్ తెలిపారు. బంధువుల ఇంట్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భార్య శోభ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.