నిజామాబాద్ నగరంలోనిఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 49 మందికి రూ. 11, 95, 000 విలువ గల చెక్కులు అందించడం జరిగిందన్నారు.