నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గోదావరి నది వద్ద బుధవారం భక్తుల కోలాహలం నెలకొంది. ఏరువాక పౌర్ణమి సందర్భంగా గోదావరి నది వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేకంగా గోదావరిలో తెప్పలు వదిలి మొక్కులు తీర్చుకున్నారు. గోదావరి నది వద్ద భక్తులతో సందడి వాతావరణం నెలకొంది.