అధర్మంపై ధర్మం అన్యాయంపై న్యాయం గెలుస్తుందని చెప్పుకోవడానికి సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పే నిదర్శనమని నవీపేట ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాల కృషి నేడు ఫలించిందన్నారు. ఎస్సీ వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పును ఇవ్వడంతో ఎమ్మార్పీఎస్ నాయకులు నవీపేట్ లో సంబరాలు జరుపుకున్నారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు.