సాలురా మండలం తగ్గేల్లి, మంధర్నా, హుంస, పోతాంగల్ మండలం సుంకిని గ్రామం నుండి ఇసుక ట్రాక్టర్లు బోధన్ మండలానికి జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గురువారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్ల అతివేగంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం పలు అనుమానాలకు దారితీస్తుంది.