నవీపేట్ మండలంలోని నాలేశ్వర్ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. సంక్రాంతి ముగ్గులతో పాటు గంగిరెద్దుల, బసవన్నలతో విద్యార్థులు అలరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సరిన్, ప్రధానోపాధ్యాయులు శ్రీ పాద్, కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, వీడీసీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.