కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో సఫాయీలకు రైన్ కోట్స్ అందజేత

57చూసినవారు
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నవీపేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం గ్రామపంచాయతీ సఫాయివాళాలకు రైన్ కోట్లను పంపిణీ చేశారు. సఫాయివాలల నడుమ కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నవీపేట్ మండల ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్