కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద శక్కర్గ చౌరస్తా సమీపంలో జాతీయ రహదారి 161పై శుక్రవారం సాయంత్రం ఆటో, స్కూటీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయినట్లు ఎస్ఐ విజయ్ కొండ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మద్నూర్కు చెందిన సుధీర్, పెద్ద శక్కర్గకు చెందిన తులసిరాం గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.