కామారెడ్డి: బంగారు ఆభరణాలు చోరీ

64చూసినవారు
కామారెడ్డి: బంగారు ఆభరణాలు చోరీ
ప్రయాణికురాలి బ్యాగులో నుంచి దొంగలు బంగారం దోచుకెళ్లిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మైలారం గ్రామానికి చెందిన సుధేష్ణ అనే మహిళ సాయంత్రం 5 గం.ల సమయంలో భీమ్గల్ వెళ్లే బస్సు ఎక్కిన తర్వాత, ఆమె చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ను పరిశీలించగా అందులో ఉన్న 8 తులాల బంగారు ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్