కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో బుధవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మానసిక ఒత్తిడికి గురైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఉప్పల్ వాయి వాసి కుమ్మరి సత్తయ్య మతిస్థిమితం సరిగా లేక ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈక్రమంలో ఇవాళ పల్లె ప్రకృతి వనంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.