విద్యుదాఘాతంతో తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పెద్దగుల్లా తండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పెద్దగుల్లా తండాకు చెందిన చవాన్ శాంతాబాయి ఆమె కుమార్తె శ్రీవాణి రాత్రి ఇంట్లో కూలర్ పెట్టుకొని నిద్రించారు. షార్ట్ సర్క్యూట్ అయిన కూలర్కు నిద్రలో ఉన్న శ్రీవాణి కాలు తగలడంతో షాక్కు గురైంది. పక్కనే నిద్రించిన తల్లికి సైతం విద్యుత్ షాక్ తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.