కల్లులో జలగ... కల్లు దుకాణం సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు

56చూసినవారు
కల్లులో జలగ... కల్లు దుకాణం సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు
కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూరులోని కల్లు దుకాణం కల్లు సీసాలో జలగలు, నత్త గుల్లలు కనిపించాయని గ్రామస్థులు ఆదివారం తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వారు కల్లు విక్రయదారులను నిలదీశారు. సీసాలను శుభ్రం చేయడం లేదన్నారు. పైగా కలుషిత నీటితో కల్లును తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు అందిన ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసి కల్లు దుకాణం సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్