కామారెడ్డిలో చోరీ ఘటన

66చూసినవారు
కామారెడ్డిలో చోరీ ఘటన
కామారెడ్డిలో చోరీ ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్ ప్రయాణికురాలి బ్యాగులో నుంచి దొంగలు బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటన గురువారం జరిగింది. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన సుధేష్ణ అనే మహిళ భీమ్గల్ వెళ్లే బస్సు ఎక్కిన తర్వాత, ఆమె చేతిలో ఉన్న హ్యాండ్బ్యాగ్ ను పరిశీలించగా, బ్యాగ్ జిప్పు ఓపెన్ చేసి ఉంది. అందులో ఉన్న సుమారు ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని ఆమె పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్